వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి లక్ష్మి సినిమా థియేటర్ హైమాస్ట్ లైట్లు వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సాయంత్రం వేళల్లో ఈ చౌరస్తాలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వెలుగులు లేక కాలినడకన వెళ్లే పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే లైట్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

