Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురపాలిక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

సాయి తేజ Jul 27, 2026 6:50 PM నాగర్ కర్నూల్తెలంగాణ
పురపాలిక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి - Udayam Digital
పురపాలిక పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. ఏడో వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని, పలు ప్రాంతాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసి, మురుగు కాలువలు, అంతర్గత రహదారుల పనులు చేపట్టాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.

Comments

G
Loading comments...