వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండల కేంద్రంలో వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. సోనియా గాంధీ గుడి వద్ద ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో వైఎస్సార్ పేదల గుండెల్లో నిలిచిపోయారని శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. కార్యక్రమంలో నక్క అనిల్, తిరుపతి, ఆనందరెడ్డి, సతీష్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

