వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ సత్యనారాయణ గౌడ్ డ్రగ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, షీ టీమ్స్ సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆన్లైన్ మోసాలు, అపరిచిత కాల్స్, ఓటీపీ షేరింగ్కు దూరంగా ఉండాలని సూచించారు. కళాశాల సిబ్బంది, పోలీసు సిబ్బంది, షీ టీమ్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

