వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసాగా నిలుస్తోందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. మంగళవారం ఉంగుటూరు క్యాంపు కార్యాలయంలో 29 మంది లబ్ధిదారులకు రూ.19,28,364 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,116 మందికి రూ.7,99,76,587 సాయం అందించామని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

