వార్తలకు తిరిగి వెళ్లండి
ఇళ్ల మధ్య నుండి 33 కెవి విద్యుత్ లైన్ వేయవద్దని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ రెండో వార్డు ప్రజలు ఆందోళన చేశారు. అధికారులు వార్డు నుండి లైన్ వేసేందుకు ప్రయత్నించగా, శనివారం స్తంభాలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
వెంకట్రావు పేట నుండి దండేపల్లికి వేరే మార్గంలో లైన్ వేయాల్సి ఉండగా, ఇళ్ల మధ్య నుండి వేయడం ఏమిటని ప్రశ్నించారు. విద్యుత్ లైన్ ను పాత మార్గంలోనే వేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

