Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆందోళన నిర్వహించిన గ్రామస్తులు

Follow Udayam on Google
p.g.murthy Aug 08, 2026 1:30 PM మంచిర్యాలతెలంగాణ
ఇళ్ల మధ్య నుండి 33 కెవి విద్యుత్ లైన్ వేయవద్దని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ రెండో వార్డు ప్రజలు ఆందోళన చేశారు. అధికారులు వార్డు నుండి లైన్ వేసేందుకు ప్రయత్నించగా, శనివారం స్తంభాలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వెంకట్రావు పేట నుండి దండేపల్లికి వేరే మార్గంలో లైన్ వేయాల్సి ఉండగా, ఇళ్ల మధ్య నుండి వేయడం ఏమిటని ప్రశ్నించారు. విద్యుత్ లైన్ ను పాత మార్గంలోనే వేయాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...