వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని: పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా గోదావరిఖని ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఆగస్టు 29 నుంచి ఆరు రోజుల ప్రత్యేక పుణ్యక్షేత్రాల యాత్ర చేపడుతున్నట్లు డిపో మేనేజర్ కవిత వెల్లడించారు.
సూపర్ లగ్జరీ బస్సులో సాగే ఈ యాత్రలో అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం బీచ్, పంచారామాలు, విజయవాడ, అమరావతి దర్శించవచ్చు. ఒక్కొక్కరికి రూ.4,600 రుసుముగా నిర్ణయించారు. భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

