Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో ఆగస్టు 10న జైల్ భరో.. భారీ ర్యాలీకి పిలుపు

Follow Udayam on Google
NAGENDRA Aug 09, 2026 12:57 PM కర్నూలుఆంధ్రప్రదేశ్
ఆదోనిలో ఆగస్టు 10న జైల్ భరో.. భారీ ర్యాలీకి పిలుపు - Udayam
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సంయుక్త కిసాన్ మోర్చా, జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎఫ్‌టీయూ పిలుపునిచ్చింది. ఆదోని పట్టణంలో ఆగస్టు 10న ఉదయం 10 గంటలకు మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువజనులు పెద్ద సంఖ్యలో రావాలన్నారు.

Comments

G
Loading comments...