వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో ఉన్న పల్లె దవాఖాన కొత్త హంగులతో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గతంలో ఆసుపత్రి భవనం పాడై తలుపులు, కిటికీలు పూర్తిగా పోయాయి.
గ్రామ సర్పంచ్ సుతారి సుమలత వినయ్ ఆసుపత్రి భవనానికి మరమ్మతులు చేయించి పూర్తి చేశారు. ఆస్పత్రికి విద్యుత్ సౌకర్యం కల్పించి, కొత్తగా తలుపులు కిటికీలను బిగించి, రంగులు వేయించి వాష్ రూమ్ నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రారంభించారు.
Comments
Loading comments...

