వార్తలకు తిరిగి వెళ్లండి
500 మంది విద్యార్థులు.. ఒక్కరే హిందీ టీచర్

బీర్కూర్ ఉన్నత పాఠశాలలో 500 మంది విద్యార్థులకు గాను కేవలం ఒక్కరే హిందీ ఉపాధ్యాయుడు ఉన్నారు. ఇద్దరు ఉండాల్సిన చోట గత రెండేళ్లుగా ఆయనే అదనపు పీరియడ్లు తీసుకుంటూ విద్యార్థులకు బోధిస్తున్నారు.
ఒక్కరే అన్ని తరగతులకు చెప్పడం ఇబ్బందిగా మారడంతో, ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మరో హిందీ టీచర్ను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Loading comments...