Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

500 మట్టి గణపతుల ఉచిత పంపిణీ

Follow Udayam on Google
RR REDDY Sep 12, 2026 6:56 PM నిజామాబాద్General
పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు పూసల గల్లీలో సిరివెన్నెల గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో 500 మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు రావట్ల జనార్ధన్ మాట్లాడుతూ రసాయన విగ్రహాలతో చెరువులు, భూగర్భ జలాలు కలుషితమై జలచరాలకు నష్టం కలుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో స్థానికులు, యువకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...