వార్తలకు తిరిగి వెళ్లండి

మరణానంతరం నేత్రదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఐడీఓసీలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఒకరి నేత్రదానం ద్వారా ఇద్దరికి చూపు ప్రసాదించే అవకాశం ఉందన్నారు.
ప్రజల్లోని అపోహలను తొలగించి, నేత్రదానంపై అవగాహన కల్పించాలని సూచించారు. మరణించిన ఆరు గంటల్లోపు 98495 45822కు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

