Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

204 మొబైల్ ఫోన్లు రికవరీ: ఎస్పీ

Follow Udayam on Google
B Ganga Aug 28, 2026 1:32 PM పార్వతీపురం మన్యంGeneral
204 మొబైల్ ఫోన్లు రికవరీ: ఎస్పీ - Udayam
పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన 204 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.28 లక్షలు. జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి బాధితులకు ఫోన్లను స్వయంగా అందజేశారు. CEIR పోర్టల్, ఐటీ కోర్ సైబర్ టీమ్ సహకారంతో ఫోన్లను గుర్తించినట్లు తెలిపారు. మొబైల్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్లో లేదా CEIR వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...