Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హజ్ యాత్రకు జిల్లా నుంచి 19 మంది ఎంపిక

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 31, 2026 12:54 PM నాగర్ కర్నూల్General
హజ్ యాత్రకు జిల్లా నుంచి 19 మంది ఎంపిక - Udayam
2027 పవిత్ర హజ్ యాత్రకు నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి 19 మంది లక్కీ డ్రా ద్వారా ఎంపికైనట్లు జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు షేఖ్ ఫరీద్ అహ్మద్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన డ్రాలో నాగర్‌కర్నూల్ నుంచి 4, కల్వకుర్తి నుంచి 11, అచ్చంపేట నుంచి 4 మంది ఎంపికయ్యారు. ఎంపికైన యాత్రికులు జిల్లా హజ్ సొసైటీ కార్యాలయంలో సంప్రదించి తదుపరి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...