వార్తలకు తిరిగి వెళ్లండి

NMM-2026 పరీక్షను నవంబర్ 15న నిర్వహించనున్నట్లు DEO బ్రహ్మాజీరావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలలోపు ఉండాలన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులకు ఫీజు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.50గా నిర్ణయించారు. ఎంపికైన వారికి 9 -12వ తరగతి వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున స్కాలర్షిప్ లభిస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

