వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో 13 ఏళ్ల పాటు ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించిన బసాని మిల్కియర్ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించారు.
విద్యార్థుల విద్యా ప్రగతి, క్రమశిక్షణతో పాటు పాఠశాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. అనంతరం ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

