వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు శిలాతోరణం వరకు క్యూలో వేచి ఉన్నారు. వీరికి 12 గంటల్లో, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
శనివారం 87,658 మంది దర్శించుకోగా, హుండీకి రూ.4.13 కోట్లు వచ్చాయి. క్యూలోని భక్తులకు అన్నప్రసాదాలు, నీరు, పాలు అందిస్తున్నారు. ఆదివారం 10 వేల ఎస్ఎస్డీ, 2 వేల శ్రీవారి మెట్టు టోకెన్లు జారీ చేశారు.
Comments
Loading comments...

