వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణలో భాగంగా మూడు కొత్త స్టేషన్ల ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. అల్వాల్ లయోలా కాలేజీ, ఆనంద్బాగ్, మౌలాలీ క్వార్టర్స్ వద్ద స్టేషన్ల నిర్మాణానికి రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపింది.
ఘట్కేసర్-సనత్నగర్ సెక్షన్లో ఈ స్టేషన్లు రావడం వల్ల శివారు ప్రాంతాల రవాణా కష్టాలు తీరనున్నాయి. బోర్డు ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభం కానుండటంతో ఐటీ, ఉద్యోగ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

