వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ పాతికేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం రాజకీయ పార్టీ కాదని, అదో విప్లవమని ఆయన అభివర్ణించారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా పార్టీ సుదీర్ఘ పోరాట ప్రయాణాన్ని గుర్తుచేస్తూ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు హరీశ్రావు ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే నినాదం ప్రజల్లో మారుమోగుతోందని, ప్రస్తుత పాలన విఫలమైందని అన్నారు. తెలంగాణ ప్రగతి మళ్ళీ పరుగులు తీసే రోజు త్వరలోనే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

