వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఈ మహమ్మారిని అంతం చేసేందుకు 'ఈగల్ ఫోర్స్' ఇతర రాష్ట్రాల్లోనూ ఆపరేషన్లు నిర్వహిస్తూ సరఫరా లింకులను సమర్థంగా ఛేదిస్తోందని ఆయన కొనియాడారు.
జిల్లాల పోలీసులు, కళాశాల యాజమాన్యాలు సమన్వయంతో పని చేయాలని డీజీపీ సూచించారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ నార్కోటిక్స్ విభాగం విశేష కృషి చేస్తోందని, యువత భవిష్యత్తును కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

