వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మాజేటి ప్రభాకర్, ఆయన భార్య పార్వతి ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. భార్య బెడ్రూమ్లో, భర్త బాత్రూమ్లో విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. తమ 14 నెలల పాపను పక్కింటి వారికి ఇచ్చి వెళ్లిన కొద్దిసేపటికే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, చిన్నపాటి గొడవలే ఈ అనర్థానికి కారణమని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

