వార్తలకు తిరిగి వెళ్లండి
బైక్ అదుపుతప్పి యువకుడు బలి

కాకినాడ జిల్లా ఎ.కొత్తపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్ల మణికంఠ (23) అనే యువకుడు దుర్మరణం చెందాడు. అన్నవరం నుంచి స్వగ్రామమైన ఏవీ నగరం వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో తీవ్ర గాయాలై ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...