వార్తలకు తిరిగి వెళ్లండి
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట రూ.2 లక్షల టోకరా

ఆన్లైన్ ఉద్యోగ ప్రకటనను నమ్మి గని ఆత్కూరుకు చెందిన త్రిసాయి అనే యువకుడు రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. ఫీజుల పేరుతో కేటుగాళ్లు విడతలవారీగా ఈ మొత్తాన్ని వసూలు చేశారు.
ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై విశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...