వార్తలకు తిరిగి వెళ్లండి
ఇల్లు తాళం పగలగొట్టి బంగారు నగలు చోరీ

గురజాడకు చెందిన తాతా సుబ్బారావు కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లిన సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టారు. బీరువాలోని అసలు బంగారాన్ని మాత్రమే ఎత్తుకెళ్లి, నకిలీ బంగారం, వెండి వస్తువులను వదిలేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. సుమారు 39 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు ఎస్ఐ బి.శ్రీను తెలిపారు. పామర్రు సీఐ నాగప్రసాద్, ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...