Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి కోసం మహిళల నిరసన

వైష్ణవి శర్మ Jul 02, 2026 8:21 AM సంగారెడ్డి 0 viewsabout 2 hours ago
తాగునీటి కోసం మహిళల నిరసన - Udayam Digital
నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్న హోతి(కె) కాలనీవాసులు, సీపీఎం నాయకులతో కలిసి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో 350 కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు యుద్ధప్రాతిపదికన బోరు మోటర్లను బిగించి, నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళనను విరమించారు.

Comments

G
Loading comments...