వార్తలకు తిరిగి వెళ్లండి
పనిమనిషిపై థార్ ఎక్కించిన మహిళ

హరియాణాలోని గురుగ్రామ్లో పార్కింగ్ ప్రదేశంలో నిద్రిస్తున్న పనిమనిషి గుడ్డి (57) పైకి ఓ మహిళ ప్రమాదవశాత్తు తన థార్ వాహనాన్ని ఎక్కించింది. ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రికి తరలించే మార్గంలోనే మృతి చెందింది.
భయపడిన నిందితురాలు మృతదేహాన్ని తిరిగి ఘటన స్థలంలోనే వదిలేసి పరారైంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...