వార్తలకు తిరిగి వెళ్లండి
ఆటో ఛార్జీ గొడవ.. రక్షణ కరువై యువకుడి మృతి

యూపీలో రూ.20 ఆటో ఛార్జీ గొడవలో రాజ్కుమార్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దాడి నుండి తప్పించుకోవడానికి పోలీసుల 'పింక్ బూత్' వద్దకు వెళ్లగా, భయపడిన మహిళా పోలీసులు తలుపులు మూసుకున్నారు.
రక్షణ కోసం తలుపు బాదడంతో గాజు పగిలి దిగబడి, తీవ్ర రక్తస్రావమైంది. 40 నిమిషాలైనా ఎవరూ స్పందించకపోవడంతో వైద్యం అందక చనిపోయాడు.
Comments
Loading comments...