వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

అనకాపల్లి జిల్లా రైవాడ శివారు శ్రీరాంపురంలో బుధవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో భార్య (హైమ) తన ప్రియుడు గంగాధర్తో కలిసి భర్త అప్పలనాయుడుని గొంతు నులిమి అంతమొందించింది.
ఈ దారుణ హత్యలో మరో ఇద్దరు కూడా పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Loading comments...