వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శంకుస్థాపన చేశారు. శేషమ్మగూడెం ఎస్టీ కాలనీ, పాతపల్లె బ్రిడ్జి వద్ద రహదారి పనులను ప్రారంభించారు.
నల్గొండను రాష్ట్రంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

