Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షంతో సింగరేణి ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి ఆగింది

Follow Udayam on Google
S kumar Aug 18, 2026 11:43 PM పెద్దపల్లితెలంగాణ
వర్షంతో సింగరేణి ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి ఆగింది - Udayam
రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-1, 2 లలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. క్వారీ పనిస్థలాలు బురదమయంగా మారడంతో షావెల్స్, డంపర్లు నిలిచిపోయాయి. దీనితో రెండో షిఫ్ట్ ఉత్పత్తి ఆగిపోయింది. అనంతరం అధికారులు రోడ్లపై బురదను తొలగించి బొగ్గు ఉత్పత్తిని పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...