వార్తలకు తిరిగి వెళ్లండి
చెన్నేరిలో కంకర క్వారీలపై గ్రామస్తుల నిరసన

సత్యవేడు మండలం చెన్నేరిలో నివాసాల సమీపంలో జరుగుతున్న ఎర్ర మట్టి తవ్వకాలపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తవ్వకాల వల్ల తమ ఇళ్లకు, జగనన్న కాలనీలకు నష్టం వాటిల్లుతోందని ఆరోపిస్తూ లారీలను అడ్డుకున్నారు.
క్వారీ అనుమతులు, తవ్వకాలపై సమగ్ర విచారణ జరపాలని వారు అధికారులను కోరారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకుని, తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...