వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటర్ల మ్యాపింగ్: ఈనెల 25 నుండి ప్రారంభం
ధీరజ్ రెడ్డి Jun 24, 2026 6:06 AM నారాయణపేట 9 viewsabout 18 hours ago

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, నర్వ మండలంలో ఈనెల 25 నుంచి ఓటర్ల జాబితా సవరణ మరియు మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టనున్నట్లు ఎమ్మార్వో మల్లారెడ్డి తెలిపారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తారు.
ఆధార్ కార్డుతో ఓటర్ కార్డును అనుసంధానించి, అర్హులైన వారికి మాత్రమే ఒకే చోట ఓటు హక్కు కల్పించేలా ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సందేహాల కోసం కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
Comments
Loading comments...