వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటరు సవరణలో పారదర్శకత పాటించాలి

ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అధికారులు, బీఎల్వోలు పారదర్శకంగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరును నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.
ఇంటింటి సర్వేలో ఎటువంటి పొరపాట్లు లేకుండా సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...