Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రమదానంతో రోడ్డు నిర్మిస్తున్న గ్రామస్తులు

దివ్య శ్రీ Jun 30, 2026 10:22 AM విశాఖపట్నం 2 viewsabout 2 hours ago
శ్రమదానంతో రోడ్డు నిర్మిస్తున్న గ్రామస్తులు - Udayam Digital
చింతపల్లి మండలంలోని మండిపల్లి, తోకపాడు గ్రామాల ప్రజలు రహదారి కోసం స్వయంగా శ్రమదానానికి దిగారు. సరైన రోడ్డు లేక, వర్షాకాలంలో వాగు దాటడం ప్రాణసంకటంగా మారడంతో అధికారుల స్పందన కోసం వేచి చూడకుండా, కొండ ప్రాంతంలో మట్టి రహదారిని నిర్మించుకుంటున్నారు. ప్రభుత్వ స్పందన లేకపోవడంతో గ్రామస్తులే పూనుకుని ఈ పని చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు శాశ్వత రహదారిని నిర్మించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...