వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం ఆముదాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సీఆర్సీ సమావేశానికి సమగ్ర శిక్ష ఏపీసీ, మండల ప్రత్యేక అధికారి మద్దిపట్ల వెంకటరమణ పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు బోధనా మెలకువలపై సూచనలు చేశారు. విద్యార్థుల అభ్యసన స్థాయిల పెంపు, కనీస సౌకర్యాల కల్పన, ఎస్ఎంసీ ఎన్నికల పారదర్శకత, విద్యార్థుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
Comments
Loading comments...

