వార్తలకు తిరిగి వెళ్లండి
రైతుల పోరాటానికి దక్కిన విజయం

వైకాపా హయాంలో ఆవులపల్లి రిజర్వాయర్ కోసం బలవంతంగా లాక్కున్న 1,911 ఎకరాల పట్టా భూములను తిరిగి రైతుల ఖాతాల్లో చేర్చే ప్రక్రియ తుది దశకు చేరింది. ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా విధించిన ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.
కూటమి ప్రభుత్వ నిర్ణయంతో 22ఏ జాబితా నుంచి భూములకు విముక్తి లభించి వందలాది మంది రైతులకు ఉపశమనం లభించింది. సీతమ్మ చెరువు పునరుద్ధరణకు రూ.25 కోట్లు కేటాయించారు.
Comments
Loading comments...