వార్తలకు తిరిగి వెళ్లండి
వందే భారత్ ప్రయాణికులకు గుడ్న్యూస్
స్వప్న రెడ్డి Jun 24, 2026 11:16 AM హైదరాబాద్ 2 viewsabout 13 hours ago

తిరుపతి–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించే వారికి దక్షిణ రైల్వే శుభవార్త అందించింది. రైలు బయలుదేరడానికి 15 నిమిషాల ముందు వరకు టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఐఆర్సీటీసీలో రియల్ టైమ్ ఖాళీలను చూసి, రెండో చార్ట్ తయారైన తర్వాత కూడా ప్రయాణికులు సులభంగా టికెట్లు పొందవచ్చు.
ఈ 'కరెంట్ బుకింగ్' సదుపాయం ద్వారా లభించే టికెట్లపై బేస్ ఫేర్లో 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. అత్యవసర ప్రయాణికులకు ఇది గొప్ప వెసులుబాటు.
Comments
Loading comments...