వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గుర్రాల జయకర్(40) ఇంటి సమీపంలోని వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై గోపతి సురేష్ తెలిపారు.
కుటుంబ కలహాలతో జయకర్ కు గొడవలు జరగగా, ఆయన తన సోదరులకు ఫోన్ చేసి బతకడం ఇష్టం లేదని చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. మృతుడి సోదరుడు గుర్రాల చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ గోపతి సురేష్ వివరించారు.
Comments
Loading comments...

