వార్తలకు తిరిగి వెళ్లండి
తుని రూరల్ సీఐకి ఎస్పీ ప్రశంసాపత్రం
విష్ణు వర్ధన్ Jun 27, 2026 7:16 AM తూర్పుగోదావరి 3 viewsabout 2 hours ago

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను కాకినాడ ఎస్పీ జి. బిందు మాధవ్ అభినందించారు. హత్య కేసు దర్యాప్తును సమర్థవంతంగా చేపట్టి, నిందితుడికి శిక్ష పడేలా కీలక ఆధారాలు సేకరించిన తుని రూరల్ సీఐ చెన్నకేశవరావుకు ఎస్పీ ప్రశంసాపత్రం అందజేశారు.
నేర దర్యాప్తులో అధికారులు ప్రదర్శించే నిబద్ధత ఇతరులకు ఆదర్శమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...