వార్తలకు తిరిగి వెళ్లండి
పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా
వినయ్ కుమార్ Jun 27, 2026 7:21 AM తూర్పుగోదావరి 6 viewsabout 2 hours ago

నిడదవోలులో 125 మంది లబ్ధిదారులకు రూ. 71.81 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను, ఎల్వోసీ పత్రాలను మంత్రి కందుల దుర్గేష్ అందజేశారు. పేదల ఆరోగ్య భద్రతకు ఈ నిధి ఒక వరమని, ప్రజారోగ్యమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన భరోసా ఇచ్చారు.
ప్రతి 15 రోజులకు ఒకసారి సిఎంఆర్ఎఫ్ సాయం అందించడం ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, పేదల సంపూర్ణ ఆరోగ్యానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...