Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ: 94.70% పూర్తయిన ఎన్యూమరేషన్

ప్రణీత రెడ్డి Jun 27, 2026 7:18 AM కాకినాడ 4 viewsabout 2 hours ago
కాకినాడ: 94.70% పూర్తయిన ఎన్యూమరేషన్ - Udayam Digital
కాకినాడ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి హరేంధిర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 15,63,299 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేశామని, ఇది 94.70 శాతం పురోగతి అని పేర్కొన్నారు. అలాగే, 1,69,240 పత్రాలను డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...