వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని, తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని మాజీ మంత్రి హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల వల్ల ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టులకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ రైతుల భవిష్యత్తును బలిపెట్టవద్దని హరీశ్రావు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

