వార్తలకు తిరిగి వెళ్లండి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మహబూబ్నగర్కు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) ఫ్లోరిడాలో ఆకస్మిక అనారోగ్యంతో కన్నుమూశారు. టెంపా నగరంలో ట్రైనింగ్లో ఉన్న ఆయన, తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
చిన్న వయసులోనే కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు స్నేహితులు, ప్రవాస తెలుగు సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
Comments
Loading comments...

