వార్తలకు తిరిగి వెళ్లండి
12 రోజుల తర్వాత చిన్నారి క్షేమంగా లభ్యం

హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 12 రోజుల క్రితం కిడ్నాప్ అయిన మూడేళ్ల చిన్నారిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. జూన్ 20న అమ్మమ్మతో కలిసి ఖమ్మం వెళ్తుండగా బాలుడు అదృశ్యమయ్యాడు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, అతను ఐడీ కార్డులు లేకుండా బస చేసిన హోటల్ను గుర్తించి బాలుడిని సురక్షితంగా కాపాడారు.
Comments
Loading comments...