Back to feed
తెలంగాణBreaking
భర్త కళ్ల ముందే భార్య గొంతుకోసి చంపిన దుండగులు
Sonal Mehrotra May 31, 2026 7:30 AM సంగారెడ్డి 4 viewsabout 1 hour ago

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పరిధిలో ఘోరం జరిగింది. బిహార్కు చెందిన అనిల్ కుమార్, మీనాదేవి (35) దంపతులు శనివారం రాత్రి సంతకు వెళ్లి బైక్పై తిరిగి వస్తుండగా గండిగూడెం వద్ద వాహనం ఆగిపోయింది. ఆ సమయంలో పొదల్లోంచి వచ్చిన దుండగులు భర్తపై దాడి చేసి, భార్యను లాక్కెళ్లి గొంతుకోసి చంపేశారు. అడ్డుకోబోయిన అనిల్కు కూడా తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...


