వార్తలకు తిరిగి వెళ్లండి
తాడ్వాయి జంగిల్ సఫారీ
Harika Jun 22, 2026 5:19 AM ములుగు 2 viewsabout 3 hours ago

ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో పర్యాటకుల కోసం జంగిల్ సఫారీని ఏర్పాటు చేశారు. రూ. 500 రుసుముతో పర్యాటకులు 36 కిలోమీటర్ల మేర దట్టమైన అడవుల్లో ప్రకృతి అందాలను, అరుదైన వన్యప్రాణులను వీక్షించే అవకాశం కల్పించారు.
సఫారీలో భాగంగా పగోడ, నెమళ్లు ఉండే పీకాక్ పోర్ట్, బ్లాక్బెర్రీ ఐలాండ్లను సందర్శించవచ్చు. నగర జీవనానికి దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తున్నారు.
Comments
Loading comments...