వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం చొరవ: 24 గంటల్లోనే పేద విద్యార్థినికి ఇల్లు
Harika Jun 22, 2026 6:18 AM ఖమ్మం 2 viewsabout 2 hours ago

ఖమ్మంకు చెందిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని తురక దేవి ప్రసన్న కుటుంబ దీనస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వెంటనే స్పందించి 24 గంటల్లోనే వారికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయించారు.
హైదరాబాద్లో జరిగిన విద్యార్థుల సన్మాన సభలో ఈ విషయాన్ని గ్రహించిన సీఎం, జిల్లా కలెక్టర్ను ఆదేశించడంతో ఖమ్మంలోని వైఎస్ నగర్ హౌసింగ్ కాంప్లెక్స్లో ఇంటి పట్టాను కుటుంబానికి అందజేశారు. సీఎం తక్షణ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Loading comments...