వార్తలకు తిరిగి వెళ్లండి
ద్యార్థుల కోసం 'ఛాత్రోన్ కీ గూంజ్': ఎంపీ ఇమ్రాన్

విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా 'ఛాత్రోన్ కీ గూంజ్' ప్రచారాన్ని ప్రారంభించారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హి తెలిపారు. పేపర్ లీకేజీలపై కోటాలో విద్యార్థులతో ఆయన నేరుగా మాట్లాడారని, దేశంలోని 28 ప్రధాన నగరాల్లో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.
పేపర్ లీక్ల కారణంగా 21 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా కేంద్ర విద్యాశాఖ మంత్రికి కనీస బాధ్యత లేదన్నారు. ఆయన ఇంకా రాజీనామా చేయలేదని, ప్రధాని ఆయనను బర్తరఫ్ చేయలేదని ఎంపీ తీవ్రంగా విమర్శించారు.
Comments
Loading comments...