వార్తలకు తిరిగి వెళ్లండి
బస్ బాడీ బిల్డింగ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

తమిళనాడులోని కరూర్-కోయంబత్తూర్ జాతీయ రహదారి సమీపంలోని కరుప్పంపాలెంలో ఉన్న ఓ ప్రైవేట్ బస్ బాడీ బిల్డింగ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెంథిల్ కుమార్కు చెందిన ఈ కేంద్రంలో చెలరేగిన మంటలను సిబ్బంది మూడు అగ్నిమాపక శకటాలతో దాదాపు మూడు గంటల పాటు శ్రమించి అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో లోపల నిలిపి ఉంచిన మూడు బస్సులతో పాటు, బస్సుల నిర్మాణానికి ఉపయోగించే యంత్రాలు, ఇతర సామాగ్రి పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...