Back to feed
ఫోన్ ట్యాపింగ్ నిందితులకు కఠిన శిక్ష పడాలి: ఎంపీ చామల
Sonal Mehrotra Jun 06, 2026 11:08 AM హైదరాబాద్ 8 viewsabout 3 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఎంపీ చామల కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ను అక్రమంగా ట్యాప్ చేసిందని ఆయన ఆరోపించారు. సొంత పార్టీ మంత్రులు, నేతల ఫోన్లను కూడా కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిజాం రాజు రజాకార్ల కంటే దారుణంగా నిఘా పెట్టి వేధించారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కిన నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో తనకు బాధితుడిగా నోటీసులు అందాయని ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...



